Wednesday, February 10, 2010

తెలంగాణ మంత్రులేం చేసారు?



"మన రాష్ట్రం ఏర్పడినప్పటినుండి అన్ని ప్రాంతాల, జిల్లాల, సామాజికవర్గాల మంత్రులు ప్రతి మంత్రివర్గంలోనూ ఉంటూనే ఉన్నారాయె. మరి అటువంటప్పుడు- కేవలం తెలంగాణేతర ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందెట్లా? తెలంగాణలో జరుగలేదెట్లా?"
ఇది సీమాంధ్రులు అడిగే ప్రశ్న. అది చాలా హేతుబద్ధమైన ప్రశ్న. దానికి సమాధానమూ తెలుపాలి.

నిజంగా చెప్పాలంటే...
"బొత్స సత్యనారాయణ 130 కోట్లలో తెలంగాణాకు 10 కోట్లే ఇచ్చాడు. తన ఒక్క జిల్లాకు మాత్రం 20 కోట్లు ఇచ్చుకున్నాడు. మిగిలినవి మిగిలిన సీమాంధ్రకు ఇచ్చాడు.
రఘువీరారెడ్డి 800 కోట్ల నిధుల్లో తనజిల్లాకు 400 కోట్లు, తన దేవుడి కడప జిల్లాకు 200 కోట్లు ఇచ్చాడు. మిగిలిన 200 కోట్లు మాత్రమే మిగిలిన రాష్ట్రానికి సర్దాడు.
.....కాబట్టి మకు అన్యాయమైంది" అంటున్నారు తెలంగాణవాళ్ళు.
మరి మీ మంత్రులు మీకు చేస్తారులే. చెయ్యలేదా అనేది ప్రశ్న. "ఎందుకు చెయ్యలేదు సాములు! మా మంత్రులు మాకూ చేసారు. ఉదాహరణకు మా సబితమ్మ ఉంది. ఆమె రజాకర్ల మంత్రి. ఆమె చేతులో ఏముంటాయి? తుపాకులూ, దుడ్డుకర్రలూనూ. ఆమె ఊరుకుందా? తన చేతిలో ఉన్నవాటిని తన జిల్లాలోని విద్యార్థులకు కడుపునిండా పెట్టింది.....తుపాకీ గుండ్లతోనూ,దుడ్డు కర్రలతోనూ...అంతే కాదు....రోగంతో నెల్లతరబడి ఆస్పత్రిలో ఉన్న దుష్టులపైనా పెట్టింది కేసులు. అంతే కదా వడ్డించేవాడు మనవాడయితే ఏ మూలనున్నా వడ్డన అందుతుంది కాదా?
కాబట్టి సీమాంధ్రులారా, అక్కడి మంత్రులారా! మీరేం మా గురించి బాధపడకండి. మావాళ్ళూ మాకూ వడ్డిస్తున్నారు.

మా దహనం నాగేందరూ ఉన్నాడు. వారి పేరులోవలె మా ఆశలనూ, ఆశయాలనూ దహనం చేస్తూ, నాగేంద్రుడాయె..రెండునాలుకలతో మాట్లాడుతూ....తన పదవీ, తన డబ్బు ఇతోధికంగా పెరుగాలనే ఏకైక అత్యాశతో పని చేస్తాడు.
ఇక మాకేం తక్కువ ? మీకంటే గొప్పవాళ్ళే మామంత్రులు. "ఇంటికి జెష్ట పొరుక్కు లక్ష్మీ" అని....

ఇలా చెప్పుకు పోతుంటే.... ఆగదిది...



1 comment:

  1. How about the previous ministers and CMs from telangana ?

    ReplyDelete