Sunday, December 20, 2009

తెలుగుసేవకు సవాల్

నేను తెలుగు సేవలో
http://groups.google.co.in/group/teluguseva/browse_thread/thread/2f7ec45a2bbb843f?hl=en

అనే చర్చలో ఈ ప్రశ్నలు సంధించా. అందులో ఏం తప్పుందో? మరివాళ్ళు దాన్ని ఎందుకు ప్రచురించలేదో వాళ్ళకే తెలియాలి.అవి.....

మిత్రులారా!
నాకు కొన్ని సందేహాలున్నాయి.తెలిసినవారు చెప్పండి.
1."ప్రస్తుతం తెలంగాణావాళ్ళకు కావాల్సింది స్వంత రాష్ట్రం కాదు.అభివృద్ధి" అన్నారు.
ఇన్నాళ్ళూ అటువంటి ప్రయత్నం జరుగలేదా? జరుగకుంటే ఎందుకు జరుగలేదు?
ఒకవేళ జరిగే ఉంటే ఇన్ని ఉద్యమాలు ఎందుకు వచ్చాయి? వాటిలో KCR తో పాటు
విద్యార్థులు,మేధావులు, జయశంకర్ వంటి నిష్కామజీవులూ ఉన్నారుగా?
2. ఇక మాటిమాటికి పొట్టిశ్రీరాములుగారిని ప్రస్తావిస్తున్నారు. అసలు ఆయనకూ తెలంగాణాకు సంబంధం ఏమిటి?
ఆ మహానుభావుణ్ణీ ఎందుకు ఇందులోకి లాగుతున్నారు?
మరోమాట.. మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయేందుకు పొట్టిశ్రీరాములు దీక్ష చేస్తే అది ఘనకార్యమా? అదే తెలంగాణా విడిపోవాలని KCR చేస్తే మాత్రం అది కుహనా వేర్పాటువాదమా?
3. అసలు తెలంగాణా విడివడితే వారికేం లాభం? మిగిలిన సీమాంధ్రులకు ఏం నష్టం?
4. తెలంగాణా విడివడితే రెండు రాష్ట్రాల ప్రజలు కొట్టుకు చస్తారా? లేకుంటే అతి ప్రేమతో ఆప్యాయంగా ఉంటారా?
5. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా అక్కడున్న తెలంగాణా కూలీలను తరిమేశారని చదివాం. అది సమైక్యంగా ఉండడానికి చిహ్నమా? ఇటువంటిపని తెలంగాణావాళ్ళు ఉద్యమసమయంలోనో తర్వాతనో చేస్తున్నారా? లేక దీని నుండి పాఠం నేర్చుకొని వాళ్ళూ ఇలాగే చెయ్యాలా? అలా చేస్తే ఎంతమంది సీమాంధ్రులు ఉపాధులు కోల్పోతారో తెలుసా?


ఇవండీ నేను సంధించిన ప్రశ్నలు. ఇందులో ఎక్కడైనా నిందనో, ఇంకేదైనా అభ్యంతరకరమైంది ఉందా? మీరే చెప్పండి. దీన్ని పోష్ట్ చెయ్యలేదు. ఇక వీళ్ళతో కలిసి మెలిసి ఉండాలట....

1 comment:

  1. nice post

    vaallu 'chora naa puthrulu' anduke answer ivvaru. post publish cheyyaru.

    ReplyDelete